Skip to content
Home » 10 Best Neethi kathalu నీతి కథలు ఇన్ తెలుగు

10 Best Neethi kathalu నీతి కథలు ఇన్ తెలుగు

  • by

Neethi kathalu in Telugu kids నీతి కథలు ఇన్ తెలుగు

1. చక్కబడిెన కొడుకు నీతి కథలు ఇన్ తెలుగు 

ఒక ఊర్లో ఒకరైతు ఉండేవాడు. అతడు ఎంతో ఓపికతో వ్యవసాయం చేసి ధనవంతుడయ్యాదు. అతనికి లేకలేక ఒక కొడుకు వుట్టాడు.

చిన్నప్పటినుండీ అతిగారంచేసి పెంచడంచేత వాడు వట్టి పోకిరివాడుగా. తయారయ్యాడు. మంచినీళ్ళలా డబ్బునువృథా చేసేవాడు.

చదువుఅబ్బలేదు. కాని చెడుతిరుగుళ్ళు మాత్రం అలవద్దాయి. బాగా ఆలోచించి రైతు ఒకనాడు తనకొడుకును దగ్గరకు పిలిచి “బాబూ! నేను చనిపోయిన

తర్వాత యీ ఆస్థి అంతా నీదే బెతుంది. కాని ఈ ఆస్థిని నీవు నిలబెట్టుకోలేవేమోనని బాధపడ్డున్నాను. కనుక నీవుగూడా డబ్బు సంపాదించగలనని నిరూపించు.

వెంటనే ఆస్థినంతా నీకిచ్చి వేస్తాను” అన్నాదు. “సరే! అట్లే చేస్తాను” అన్నాడు కొడుకు. ఆరోజే పనికి బయలుదేరాడు.

చదువు సంధ్యలు లేనివాళ్ళకి ఉద్యోగం ఎవరిస్తారు? ఏ పనీదొరక్క ఒకమిల్లులో బస్తాలు మోసే కూలివాడిగా చేరాడు.

మొదటిరోజు వానికి 20రూ.లు కూలి వచ్చింది. దాన్ని సంతోషంగా తీసుకెళ్ళి తండ్రికి యిచ్చాడు. వెంటనే రైతు ఆ డబ్బుల్ని తీసుకెళ్ళి నూతిలో పడేశాడు.

మర్నాడు కూడా డబ్బును తీసుకెళ్ళి నూతిలోనే వేశాడు. నాలుగు రోజులు అట్లా పడవేసిన తర్వాత ఐదో రోజున తండ్రి డబ్బును నూతిలోపడవేస్తూంటే

అద్దుకొని “అదేంటినాన్నా! నేను ఎంతోకష్టపడి మూటలుమోసి సంపాదించిన నాకష్టార్దితాన్ని అలా నూతిలో పడేస్తున్నావెందుకు?” అని అడిగాడు కొడుకు.

దానికి సంతోషంతో రైతు, కొడుకు వీపుచరుస్తూ “ఈ సమయం కోసమే నేను చూస్తున్నాను. నీ సంపాదన నీళ్ళపాలౌతోందని బాధపడిపోతున్నావు.

నా సంపాదనను నీవు పాడుచేసినప్పుడు నే నెంత బాధపడ్డానో నీకు తెలియ చెప్పడానికే నేను అట్లాచేశాను.

డబ్బు సంపాదించడమే కష్టం-ఖర్చు చేయడం బహుతేలిక! ఈ విషయం నీకు యిప్పుడు అర్థమైందని అనుకొంటున్నాను!” అన్నాడు.

తనతప్పు తెలిసికొన్నాడు కొడుకు. తన్ను క్షమించవలసిందని తండ్రినికోరి అప్పటినుండీ దూబరాగా ఖర్చుచేయడంమాని, పాదుపరి అయ్యాడు.

నీతి :- పొదుపు చేసి ఆనందంగా జీవించు.

2. నక్క – కోడిపుంజు – నీతి కథలు ఇన్ తెలుగు

నక్క - కోడిపుంజు - నీతి కథలు ఇన్ తెలుగు

ఒకరోజున ఒక నక్క ఆకలితో మలమలమాడి పోతూ, ఎక్కడేనా ఏదైనా తిండి దొరకవచ్చునని అంతటా వెతకుతోంది. అప్పుడు దానికొక కోడిపుంజు.

కన్పించింది. కాని అది ఒక చెట్టుకొమ్మమీద కూర్చొని ఉంది. దాన్ని చూడగానే నక్కకు ఆకలి రెట్టింపైంది. ఏదో విధంగా ఆ పుంజును చంపి ఆకలి తీర్చుకోవాలనుకొంది.

మెల్లగా ఆ చెట్టువద్దకు వచ్చి “మిత్రమా! ఆకాశవాణి, నుండి నిన్న ఒక వార్త విన్పించింది. ఇకమీదట జంతువులన్నీ కలిసిమెలిసి ‘స్నేహితుల్లాగ జీవించాలట. అందుచేత క్రిందకురా! మనమిద్దరం స్నేహితుల్లాగ మసులుకొందాం!” అంది.

ఆ జిత్తులమారి నక్క చెప్పేదాంట్లో నిజమెంతో ఆ కోడిపుంజుకుతెల్సు. అందుచేత అది “అవును ఆ వార్త నేనుగూడా విన్నాను.” అంది. లోలోపల కోడిపుంజు నక్కబారినుండి ఎలాతప్పించుకోవాలో ఆలోచిస్తోంది.

చివరకు యిలా అంది.. “అదిగో! నీ స్నేహితులెవరో యిటేవస్తున్నారు. వాళ్ళని గూడా రానీ! అందరమూ కలిసి అప్పుడు పండుగ చేసుకొందాం!”

“ఈదారిన వచ్చే నా స్నేహితులెవరూలేరే! ఇంతకూ ఎవరొస్తున్నారు?” అని అడిగింది నక్క

“వేటకుక్కలూ, వాటి స్నేహితులూ” జవాబిచ్చింది పుంజు,

వేటకుక్కలపేరు వినగానే నక్క హడలెత్తిపోయి వణకడం. మొదలెట్టింది. “వాటి కంటబడితే చావడం ఖాయం” అనుకొన్నది నక్క

“అలా భయంతో వణకిపోతున్నావెందుకు?” అని అడిగింది కోడిపుంజు

అందుకు నక్క “వాళ్ళు బహుశా నిన్నటివార్త వినలేదేమో అనుకొంటా”
అంటూ పరుగెత్తి పారిపోయింది.

నీతి:- మోసాన్ని మోసంతోనే జయించాలి

3. పట్టుదల – నీతి కథలు ఇన్ తెలుగు

ఒకసారి ఒకపెద్ద యుద్ధం జరిగింది. చిన్న సైన్యంతో ఒకరాజు, పెద్ద సైన్యంతో ఒకరాజు యుద్దం చేశారు. ఎవరిశక్తి కొలదీ వారు పోట్లాడారు.

ఎత్తులకు పైఎత్తులువేసి ఎదుటి వాళ్ళని చిత్తుచేయాలని యిద్దరూ ప్రయత్నం చేశారు. కాని పాపం! చిన్నసైన్యం ఉన్నరాజు ఓడిపోయే పరిస్థితి వచ్చింది.

ఆ రాజు మిక్కిలి అలసిపోయాడు. వంటినిండా దెబ్బలతో అతనికి నిలబడే శక్తికూడా లేకపోయింది.

తాను నెగ్గడం ఎటూ కుదరదని తెలిసి ఆ రాజు మెల్లగా ప్రక్కదారిన పారిపోయి దగ్గరలోని ఒక గుహలో దాక్కున్నాడు.

అక్కడ అతనికి ఒకసాలీడు కన్పించింది. అది క్రిందనుండి పైనున్న ‘తనగూటికి చేరుకోవాలని ప్రయత్నం చేస్తోంది. కాని అది క్రిందకు పడిపోతోంది.

‘ఒకసారికాదు అనేకసార్లు అది క్రిందపడి పోయింది. అయినా అది తన ప్రయత్నం మానక 17వసారి తనగూటికి చేరుకొంది.

దానిపట్టుదల చూచిన రాజుకు జ్ఞానోదయమయ్యింది. “ఎన్నికష్టాలు. ఎదురైనా పట్టుదలతో కార్యాన్ని సాధించాలి” అని నిర్ణయించుకొన్నాదు.

“ఈసారి తప్పక శత్రువును ఓడించి తీరాలి” అని గట్టిగా నిర్ణయించుకొని, మళ్ళీ ఆపెద్దరాజుతో యుద్ధం చేయడం మొదలుపెట్టాడు.

సైనికులకు తగిన శిక్షణనిచ్చుటచేత వాళ్ళు సులభంగా శత్రువును మట్టికరపించారు. పెద్ద సైన్యంగల రాజే ఓడిపోయాడు. చిన్నరాజు విజేత అయ్యాడు.

‘నీతి:- జయం పొందాలంటే మళ్ళీమళ్ళీ ప్రయత్నించాలి

4. కుక్క – మాంసంముక్క – నీతి కథలు ఇన్ తెలుగు

‘బకకోజున ఒకడు ఐజార్లు పోతుంటే దానికి ఒక మాంనంమక్క డాధకింద బాసకి లలా అధీగౌ టంది. కాన్‌ అక్యదే తినడు ధానికి సచ్ఫలేదు.

“హాయిగ కాలుడ చలి టద్పసుదాయి ఎవరూలేవరోట తింటాను అనుకొంది రాడువమీదనున్న బిన్నవంలెన దాటి అవి వైపుకు పోతూపోతూ ఫల చాసుదు అక్కడో ఒక పక్క దాని నోద్యోకూదా మాంసంమక్య క్పేందాయి అది ఈన సీడ అని దానికీ తెలియదు.

అర్య అ మాంసంముక్క ఎంతబాగుందో! ఆ ముక్యకూడా నాకు వస్తే, నాకు ళదేసక్పదంటాయి. సయగా తినవచ్చు నమ గర్జగా మొరగతే ఆ ‘మ్యభారరి దోయి చి మాంసాన్ని వదిలేసి పారిపోతుంది” అనుకొని భో! (అని అందింది. నీ మొగతే అ కుక్క (నోరు పెదవలేదు) జవాబుగా ఏమీ: ‘మైంగలేడు. కాన్‌ ఒకరప్పుడు మాత్రం విన్పించింది. అది కుక్క నోట్లోని

5. దురాశ – నీతి కథలు ఇన్ తెలుగు

అనగనగా ఒక పేద బ్రాహ్మణుడు. అతను చాలా దురాశకలవాడు. ఒకసారి అతను పనిమీద ఒక అడవిలో నుండి వెళ్తున్నాడు. మధ్యలో నీటిమడుగు అడ్డం వచ్చింది.

ఆ మడుగు అవతల ఒక చిన్న గుహ వుంది. గుహ ముందు కూర్చున్నపులిని చూసేసరికి. ‘ బ్రాహ్మణుడికి పై ప్రాణాలు పైనే పోయాయి.

ఆ మడుగులో నీళ్లు మోకాలిలోతే వున్నాయి. పులి చాలా ముసభిది: దానికి నడవడానికి కూడా శక్తిలేదు. బ్రాహ్మణుజ్జి చూసి.

చెయ్యెత్తి పిలిచింది. దాని చేతిలో ఒక బంగారు గాజు మెరుస్తూ వుంది. అ “ఓ బ్రాహ్మణుడా! నన్ను చూసి భయపడకు. నేనొక వృద్ధ పులిని.

కదలలేను. మెదలలేను. నాకు చానాళ్ల క్రితం ఈ బంగారు గాజు దొరికింది. దీనిని ఎవరికన్నా ఇద్దామనుకుంటే నన్నుచూసి భయపడి ఎవరూ నా దగ్గరకు రావడం లేదు.

నేను హింస మానేసి, మాంసాహారం మానేసి పవిత్రజీవితం గడుపుతున్నాను. ఈ గాజు తీసుకుని

నాకు కొంచెం పుణ్యం వచ్చేలా చెయ్యి” అంది ప్రశాంతంగా, మొదట బ్రాహ్మణుడు భయపడ్డాడు. కానీ బంగారుగాజు మీద ఆశ అతని భయాన్ని

పోగొట్టింది. అడుగులో అడుగు వేసుకుంటూ ఆ ప్పలి దగ్గరిక్‌ వెళ్లాడు. అంతే…! ఒక్కసారిగా ఆతనిమీదకి లంఘించి చంపి తినేసింది.

నీతి :దురాశదుఖానికి చేటు

   

 7. హితవు  – నీతి కథలు ఇన్ తెలుగు

ఒక అడవిలో కొన్ని కోతులు నివాసం ఉండేవి. వేసవికాలం రావడంతో అడవిలోని చెరువులు, నీటికాలువలు పూర్తిగా ఎండిపోయాయి.

ఒకరోజు కోతులకు విపరీతమైన దాహం వేసింది. నీటి కోసం నెతుకుతూ అవి అడవిని దాటాయి. అక్కడ ఇసుకలో నీటి అలల్లా ఎండమావులు మెరుస్తూ కనిపించాయి.

వాటిని నీటిగా భావించిన కోతులు మూకుమ్మడిగా అటువైపు పరుగెత్తాయి. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ నీళ్ళు లేవు సరికదా

మరి కొంత దూరంలో నీటి అలలు మెరుస్తూ కనిపించాయి. దానితో కోతులు తిరిగి ముందుకు పరుగెత్తాయి. ఆ విధంగా కోతులు ఆ ఎండలో ఎండమావుల

వెంట నీటి కోసం వెతుకుతూనే ఉన్నాయి. “నీళ్ళతో గొంతు తడుపుకోకపోతే నా (ప్రాణం పోయేలా ఉంది.” దీనంగా అంది ఒక కోతి.

“నిం చేద్దాం… నీళ్ళు కనబడుతు న్నాయి కానీ చేతికి అందటం లేదు. ఇదేమి మాయో…” అంది మరొక కోతి. పొదలో ఒక కుందేలు నివాసం ఉంటోంది.

ఆ కుందేలు జరిగినదంతా చూసింది. కోతులకు సహాయం చేయా లని వచ్చి వాటి ముందు నిలబడింది. “ఎండమావుల్లో ఎక్కడైనా నీరు ఉంటుందా? దగ్గరలో చెరువు ఒకటి ఉంది.

అక్కడికి వెళ్ళీ మీ దాహం తీర్చు కోండి” అని చెప్పింది. ఇది విని కోతు లకు చాలా కోపం వచ్చింది.

“మేం తెలివితక్కువవాళ్ళమా?” అంటూ ఒక కోతి కుందేలు ఘైకి దూకి దాని మెడ పట్టుకుంది.  నేను చెప్పేది నిజం.

నా మూటలు నమ్మండి” భయంగా అరిబింది కుందేలు. ఆ కోతి కుందేలును బలంగా నేలకేసి కొట్టింది. ఆ దెబ్బతో కీుగా అరుస్తూ కుందెలు (పాణం పదిలేసింది.

నీతి; మూర్చులకు హితవు చెబితే దాని పర్యవసానం ఇలాగే ఉంటుంది.

8. తన కోపమె తన శత్రువు – నీతి కథలు ఇన్ తెలుగు

ధీరజ్‌కి ఆ రోజు చాలా పని ఎక్కువ కావడంతో ఆఫీసు నుండి బయలుదే రేసరికి పదకొండు గంటలయ్యింది. రహదారి మీద వాహనాలు ఎక్కు వగా లేవు.

ఆలస్యమయ్యిందని ధీరజ్‌ చిరాకుగా ఉన్నాడు. కారుని వేగంగా నడుపుతున్నాడు. హఠాత్తుగా కారు ఆగిపోయింది. చిరాకుగా దిగి కారును పరీక్ష చేశాడు.

ఒక టైరులో గాలి లేదు. పైగా టైరుకు ఒక రంధ్రం కూడా ఉన్నట్టు గమనించాడు. చిరాకుతో పాటు కోపం కూడా వచ్చింది.

టైరు మారుద్దామని పనిముట్ల కోసం వెతికితే అవి కారులో లేవు. చుట్టూ తిరిగి చూశాడు. డూరంలో ఒక వెలుగు కనిపించింది.

అది ఇల్లయి ఉంటుందనుకున్నాడు. ఆ ఇంట్లో వారు తనకేదయినా సహాయం చేస్తారేమోనని అక్కడికి వెళ్ళల నుకుని బయలుదేరాడు.

వెప్తా ఉండగా అతని మనసులో “ఆ ఇంట్లో అసలు ఎవరైనా ఉన్నారా? ఉంటే ఒక అపరిచిత వ్యక్తికి సహాయం చేస్తారా? ఏం ఎందుకు చేయకూడదు?

నేను వాళ్ళని పనిముట్లే కదా అడిగేది. తోటి మనుషులుగా అంత సహాయం కూడా చేయలేరా? ఎలా ఇవ్వరో నేనూ చూస్తాను” అనుకుంటున్నాడు. కోపంగా, ఆవేశంగా ఉన్నందువల్ల ఎన్నో ఆలోచనలు వచ్చాయి.

కోపంతో అతని ఆలోచన నరైన ధోరణిలో లేదు. ఆ ఇల్లు చేరక ముందే వాళ్ళిందుకు నాకు నహాయం చేయరు అని వాళ్ళని నిలదీయా లని నిర్ణయించుకున్నాడు.

ఆ ఇంటి తలు పును గట్టిగా కొట్టాడు. ఎవ్వరూ తలుపు తీయలేదు. ఇంకోసారి గట్టిగా తలుపు కొట్టిన ప్పుడు ఒక వృద్దుడు తలుపు తీశాడు.

ధీరజ్‌ ఆ వృద్భడిని చూడగానే “నేనేమీ మిమ్మల్ని పెద్ద సహాయం అడగటం లేదుగా. తోటి మనిషికి అంత సహాయం కూడా మీరు చేయలేరా?” అని ఆవేశంతో అరవడం మొదలుపెట్టాడు.

అప్పుడు వృద్ధుడు “నీకేం కావాలో కూడా నాకు చెప్పకుండా నా మీదే అరుస్తు న్నావేం?” అని అడిగాడు. ధీరజ్‌కు తన (ప్రవర్తన మీద తనకే నిగ్గు వేసింది.

కోపంలో జరగని విషయాలను ఊహించుకున్నాడని తెలుసుకున్నాడు. వృద్ధుడి దగ్గర తనకు కాన నీన సహాయం వివరించి, తరవాత కృృ్ఞు తలు తెలిపాడు.

కోపంలో, ఆవేశంలో మనమేం చేస్తున్నామో మనకే తెలీదు కాబట్టి కోపాన్ని అదుపులో ఉంచుకోవడం మంచిది.

9. మనశాంతి  – నీతి కథలు ఇన్ తెలుగు

రాజుగారికి ఉన్నట్టుండి ఒకరోజు ‘ఎపరు నిజమైన ప్రశాంతతో ఉంటున్నారు?” అన్న సందేహం కలిగింది. దర్భ్చారులో మంత్రిని, సామంతులను, పండితులను అడిగాడు. 
కానీ అందుకు తగిన సమాధానం లభించ లేదు. మంత్రి అనేక ఉదాహరణలు చెప్పినా రాజుగారికి నచ్చలేదు. తానే సమాధానం కనుక్కోవాలని నిర్ణయించుకున్నాడు.
ఒకరోజు రాజు వేటకి వెళ్లాడు. కౌందరు సైనికులతో పాటు అలా అడవిలో తిరుగుతూ. వేట కొనసాగించాడు. 
అలా తిరుగుతూండగా రాజుకు దూరం నుంటి ఎవరో పాడుతున్న రాగం వినిపింబింది. అడవిలో పాటలు పాడుతూ ఎవరు తిరుగుతున్నారని ఆ రాగం వినిపించేవై పుగా రాజు ఒక్కడే వెళ్లాడు. 
ఒక నడివయసు వ్యక్తి కొమ్మలు కొడుతూ కనిపించాడు. రాజు మారువేషంలో వచ్చాడు కనుక గుర్దిం చక తనపాటికి తాను పాడుతూనే ఉన్నాడు. రాజుకు ఆశ్చర్యమేసి అతని దగ్గరికి వెళ్లాడు.
“నువ్వెంతో ఆనందంగా ఉన్నావు. ఇదెలా సాధ్యం? ఏ దిగుతూ విచారమూ లేదా?” అని అడిగాడు.
ఆ వ్యక్తీ నవ్వుతూ “’అవును నిజమే! నేను ఛాలా సంతోషంగా ఉన్నాను. ఈ రాజ్యపు రాజుగారికంటే కూడా సంతో షంగా ఆనందంగా ఉన్నాను” అన్నాడు.
“ఇదెలా సాధ్యం? రాజుగారి కంటే నీ దగ్గర ఎక్కువ ఏముంది?” అని ఆశ్చర్యంగా అడిగాడు రాజు.
అతను “రాజుగారిలా ధనరాసులు, మందీ మార్చలం లేవు. కాని నాకు (ప్రకృతి సంపద ఉంది. ఈ అడవి… ఆహారాన్నిస్తుంది, వంటచెరకూ ఇస్తుంది. 
ఈ కొండలు, నీలాకాశం ఎంతో మనశ్శాంతిని స్తున్నాయి. ఆహారం,. సీరు, (హాంతత పొందుతున్నాను, ప్రకృతి నన్ను కన్నటి జ్ఞలా చూసుకుంటోంది. 
మరి నాకంటే అనందంగా ఉండేవారు, ధనికులు ఎవరైనా ఉంటారా?” అన్నాడు. నిజమైన ఆనందం మన్శంతిలోనే ఉందని రాజు తెలుసుకున్నాడు.

  10. దానం  – నీతి కథలు ఇన్ తెలుగు

ఓక రాజు తన గురువు గొప్పతనాన్ని మెచ్చుకుంటూ పట్లు బట్టల్ని బయత ఇచ్చాడు. గురువు ఎంతో సేంతోషంగా వాటీని స్వీకరించి ఇంటికి వెళ్తుండగా దారి పక్కన ఒక బిచ్చగాడు చలికి
వణుకుతూ కనిపించాడు.

అతడి అవస్థకు జాలిపడి తన చేతిలోటన ్స్‌ పట్టు బట్టల్న్‌ ఇచ్చేశాడు. మర్చాడు రాజు అటుగా వెక్తీన పుడు తాను బపహోకరించిన పట్టు బట్టల్ని బిచ్చగాడు కట్టుకోవడం చూసి చౌలా. కోపగించుకున్నాడు.

కొద్దిరోజుల తర్వాత గురువుకి బంగారు శ్రడీియం బహుమతిగా ఇచ్చాడు రాజా: ఆ కడియాన్ని కూతురు పెళ్లిచేయదానికి కష్టపడుతున్న ఓీ రాజోద్యోగికి బహూకరించాడు గురువు,

ఆ విషయం రాజుకు తెలిసి వెంటనే గురువుని పిలిచి… ‘మీమీద గౌరవంతో నేను బహునుతులు ఇస్తుంటే,
వాటిని మీకు నచ్చినట్లు అందరికీ పంచే యడం పద్ధతిగా లేదు అని కోపంగా అడిగాడు రొజు, బదులుగా… ‘దానం చేయడమంటే ఆ వస్తువు లేదా సొమ్ము మనది కాదని పూర్తిగా అంగీకరించినస్లు.

మీరు దానం ఇచ్చిన విషయాన్ని ఇంకా గుర్తుంచుకున్నారంటే, నన్ను ప్రశ్నిస్తున్నా రంటే, ఆ వస్తువే మీది అనే ఇంకో భావిస్తున్నట్లు, ఇలా అయితే దాన ఫలితం మీకు దక్కదు, అయినా మీరు అడుగు తున్నారు కాబట్టి చెబుతున్నాను…

ఆ వస్తువుల అవసరం నాకంటే వారికే ఎక్కువ అనిపేంచింది. అందుకే వారికి ఇచ్చేశాను. అంతే తప్ప మీపైన గౌరవం లేక కాదు’ అని చెప్పాడు గురువు.

ఆ మాటలతో తన తప్పును తెలుసుకుని గురువుగారి దగ్గర క్షమాపణ కోరాడు.